సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం జక్కన్న. ఈ సినిమా విడుదల డేట్ ఫిక్స్ చేసేసారు. 22న విడుదల చేయాలని డిసైడ్ అయిపోయారు. రామెజిఫిల్మ్ సిటిలో చివరి పాట చిత్రీకరణలో వుంది. మరో రెండు రోజుల్లో షూటింగ్ పార్ట్ అంతా పూర్తవుతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. దినేష్ సంగీత దర్శకుడు. ఈచిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జులై 22 విడుదలకి సన్నాహలు చేస్తున్నారు.
నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, సునీల్ నటించిన మంచి ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మా జక్కన్న చిత్రం. సునీల్ కామెడి టైమింగ్ కి డైరక్టర్ వంశి రాసిన సీన్ కి ధియోటర్స్ లో క్లాప్స్ పడతాయి. దీనికి ఉదాహరణ రీసెంట్ గా రిలీజయ్యిన ధియోట్రికల్ ట్రైలర్. అదే విధంగా దినేష్ అందిచిన ఆడియోకి కూడా మంచి టాక్ వచ్చింది అన్నారు. ఎట్టిపరిస్ధితిలో మా చిత్రాన్ని జులై 22న విడుదల చేయటానికి సన్నాహలు చేస్తాము, అని అన్నారు.