అనసూయ చాలా మారిపోయింది.!

'విన్నర్‌' సినిమాలో బుల్లితెర బ్యూటీ అనసూయ ఐటమ్‌ సాంగ్‌ చేసిన విషయం విదితమే. పవన్‌కళ్యాణ్‌తో 'అత్తారింటికి దారేది' సినిమాలో ఇదే తరహాలో ఐటమ్‌ సాంగ్‌ చేసే ఛాన్సొస్తే, 'నేనలాంటివి చెయ్యను..' అని తెగేసి చెప్పిన అనసూయ, ఆ తర్వాత 'సోగ్గాడే చిన్ని నాయనా'లో చేసింది కూడా ఐటమ్‌ సాంగే. ఐటమ్‌ సాంగ్స్‌ విలువేంటో, అనసూయకి బాగానే తెలిసొచ్చింది. అందుకే, ఈసారి మెగా ఆఫర్‌ వదులుకోలేకపోయింది. 'విన్నర్‌'లో సాయిధరమ్‌తేజతో ఆడి పాడింది. 

'విన్నర్‌'లో ఐటమ్‌ సాంగ్‌ గురించి అడిగితే, సాయిధరమ్‌తో పోటీ పడి డాన్సులు చేయలేకపోయాననీ, మెగా వారసుడు ఎలా ఉంటాడో దగ్గర్నుంచి చూశాననీ చెప్పుకొచ్చింది అనసూయ. హీరోల భజనలో అందాల భామలు మునిగి తేలడం మామూలే. కానీ, అనసూయ నుంచి ఏదో కొత్తగా ఆశిస్తారు కామెంట్లని. ఎందుకంటే, ఆమె వెరీ వెరీ స్పెషల్‌ కదా.! 'అత్తారింటికి దారేది' సినిమాలో చేసి వుంటే, అనసూయ కెరీర్‌ ఇప్పుడు ఇంకో రేంజ్‌లో వుండేది. 

కారణం ఏమైతేనేం, తత్వం బోధపడ్డానికి చాలా టైమే తీసుకుంది అనసూయ. ఇకపై ఐటమ్‌ సాంగ్స్‌ కొనసాగిస్తుందో లేదోగానీ, ఆమె మాటల్లో చాలా మార్పు వచ్చిందని టాలీవుడ్‌ సినీ జనం అభిప్రాయపడ్తున్నారు. ఓ పక్క తన సహచరి (జబర్‌దస్త్‌ కో-యాంకర్‌) ఏ అవకాశాన్నీ వదులుకోకుండా, వరుస ఆఫర్లు దక్కించుకుంటుండడంతోనే బహుశా అనసూయ ఇలా ఐటమ్‌ సాంగ్స్‌కి 'సై' అనేసినట్టుంది.

Show comments