అటు ఎన్టీఆర్-ఇటు నాగార్జున

ప్రేమమ్ సినిమా హిట్ కొట్టిన తరువాత చందు మొండేటి డిమాండ్ పెరిగిపోయింది. తరువాతి సినిమాకు నిర్మాత ఫిక్స్ అయిపోయారు ఎప్పుడో. కానీ హీరో ఎవరు అన్నదే తేలలేదు. సబ్జెక్ట్ రెడీగావుంది. ప్రేమమ్ కు ముందు నాగ్ చైతన్యకు చెప్పినదే. ఇప్పుడు ఆ సినిమాను డాడీ నాగార్జునతో చేయమని చైతూ గట్టి పట్టుబట్టి కూర్చున్నాడట. 

ఎలాగైనా నాగ్ తో చందూ సినిమా చేయాల్సిందే అని అంటున్నాడట చైతూ. దీనికి నిర్మాత ఐ డ్రీమ్ వాసు కూడా సుముఖంగానే వున్నట్లు తెలుస్తోంది. మరోపక్క సరైన డైరక్టర్ కనిపించక, ఖాళీగా వుండిపోయిన ఎన్టీఆర్ కూడా చందూకు కబురు చేసారు. తను రెడీ అని ఆఫర్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా లైన్ ఏమిటి అని అడిగి తెలుసుకున్నారు. తన వైపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. 

ఇప్పుడు బంతి చందూ-ఐడ్రీమ్ వాసు కోర్టులో వుంది. వారు ఎటు డిసైడ్ చేస్తే అటే పడుతుంది. అయితే ఒకటే అనుమానం, చైతూ లాంటి యంగ్ హీరో కోసం తయారుచేసిన సబ్జెక్ట్, ఎన్టీఆర్ వరకు ఒకె కానీ, నాగార్జునకు సూట్ అవుతుందా? అన్నదే.

Show comments