తొలి సినిమా 'ముకుంద' విడుదలకు ముందే 'మెగా ప్రిన్స్' అనే గుర్తింపు సంపాదించేసుకున్నాడు కొణిదెల వరుణ్తేజ. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు తనయుడైన వరుణ్ని, 'మెగా అందగాడు' అనేశారు అభిమానులు.
తొలి సినిమా 'ముకుంద'తో ఆకట్టుకునే ప్రయత్నమైతే చేశాడు. కొంతమేర సఫలమయ్యాడు కూడా. రెండో సినిమా 'కంచె'తోనూ అంతే. అయితే, మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వరుణ్, ఆ స్థాయికి తగ్గ స్టార్డమ్ సొంతం చేసుకునేంత హిట్ మాత్రం ఇప్పటిదాకా సొంతం చేసుకోలేకపోయాడు.
'లోఫర్', 'మిస్టర్' సినిమాలు ఒకదాన్ని మించి ఇంకోటి పరాజయం పాలవడంతో వరుణ్ తేజ కెరీర్ బాగా డల్ అయిపోయింది. ఎప్పుడో విడుదలవ్వాల్సిన 'మిస్టర్' వరుణ్ కాలికి గాయం కారణంగా ఆలస్యమయ్యింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ నటిస్తున్న 'ఫిదా' పరిస్థితీ అంతే. 'మిస్టర్' ప్రేక్షకుల ముందుకొచ్చి నిరాశపరిస్తే, 'ఫిదా' విడుదలకు సిద్ధమవుతోంది. ఇంతలోనే, వరుణ్ హీరోగా మరో సినిమా ప్రారంభమయ్యింది.
వెంకట్ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమాలో వరుణ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్గా నటించనుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మొత్తమ్మీద, సినిమాల లైనప్ విషయంలో తేడాలేమీ లేకపోయినా, కొన్ని సినిమాల రిలీజ్ ఆలస్యమవుతుండడం.. వచ్చిన సినిమాలు వచ్చినట్లే నిరాశపరుస్తుండడంతో.. మెగా ప్రిన్స్ కెరీర్లో జోష్ మాత్రం కన్పించడంలేదు. ఒక్క హిట్టు.. ఒకే ఒక్క కమర్షియల్ హిట్టు కావాలిప్పుడు మెగా ప్రిన్స్కి. ఆ హిట్ 'ఫిదా'తో దక్కుతుందా.? వేచి చూడాల్సిందే.