ఏమైనా రాస్కోండి.. పిల్ల మాత్రం నాదే

బాలీవుడ్ లో పుకార్లు కామన్. అయితే ఆ పుకార్లను ఎగదోయడంలో మరింత ముదిరిపోయారు హిందీ హీరోలు. ఒకప్పుడు వాళ్లే పుకార్లు సృష్టించేవారు. కానీ ఇప్పుడా పుకార్లకు మసాలా అద్దడం కూడా నేర్చుకున్నారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాటలు వింటే విషయం మీకే అర్థమౌతుంది.

కృతి సనన్ తో కలిసి "రాబ్తా" మూవీ చేశాడు సుశాంత్. వచ్చేనెలలో ఆ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈలోపు ప్రచారంలో భాగంగా సుశాంత్-కృతి తెగ రాసుకుంటూ తిరిగేస్తున్నారు. అయితే సుశాంత్ కు కాస్త షార్ట్ టెంపర్ ఉంది. ఎవరితోనైనా ఇట్టే గొడవలు పెట్టుకుంటాడు. కృతితో కూడా ఈ మధ్య అలాంటిదే చిన్న గొడవ జరిగింది.

ఈ విషయంపై చాలా కథనాలు వచ్చాయి. తాజాగా ఆ గొడవల్ని ప్రస్తావించిన సుశాంత్, ఎవరెన్ని రాసుకున్నప్పటికీ.. కృతి సనన్ మాత్రం నాదే అంటూ ప్రకటించేశాడు. అంటే దీనర్థం ఏంటి? వాళ్లిద్దరూ లవ్ లో ఉన్నారనా.. లేక కృతి సనన్ ను వదిలేదు లేదనా..? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మాత్రం చెప్పలేదు ఈ హీరో. మరోవైపు కృతి మాత్రం వారం రోజులుగా ప్రమోషన్ కు దూరంగా ఉంది.

Show comments