మెగాస్టార్‌లో మెగా జోష్‌ వచ్చింది

'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్‌ షోలో చిరంజీవి ఎలా వుంటారు.? ఆ షోని ఎలా నిర్వహిస్తారు.? అనే సస్పెన్స్‌ వీడింది. తొలి వారం నాలుగు రోజులపాటు ఈ 'షో' సాగింది. అయితే, అభిమానులు ఆశించిన స్థాయిలో ఈ షోని చిరంజీవి నిర్వహించలేకపోయారన్నది నిర్వివాదాంశం. నాగార్జున హోస్ట్‌గా వున్నప్పుడూ మొదట్లో ఇదే పరిస్థితి. 

అయితే, రెండో వారం మాత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఫుల్‌ జోష్‌లో వుంటుందనే సంకేతాలు పంపేశారు. వచ్చేవారం సెలబ్రిటీల హంగామా కన్పించనుంది. ఆల్రెడీ నాగార్జున, ప్రగ్యాజైస్వాల్‌ నిన్నటి షోలో కన్పించడంతో చిరంజీవిలోనూ ఆ జోష్‌ కన్పించిందనుకోండి.. అది వేరే విషయం. అయినాసరే, చిరంజీవిలో ఎక్సయిట్‌మెంట్‌, ఆయనలోని 'ఈజ్‌'ని ప్రస్తుతానికి అండర్‌ప్లే చేసేలా చేస్తోంది. మెగాస్టార్ సెన్సాఫ్ హ్యూమర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అదంతా ముందు ముందు ఎపిసోడ్స్ లో మనం చూడబోతున్నామేమో.

ఒకప్పటి తన హీరోయిన్లతో వచ్చేవారం 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకి చిరంజీవి కొత్త గ్లామర్‌ తీసుకురానున్నారు. రాధిక, సుహాసినిలతోపాటు ఈ తరం నటీనటులు రాణా, తాప్సీ, సాయిధరమ్‌ తేజ.. ఇలా సెలబ్రిటీలతో వచ్చేవారం ఎపిసోడ్స్‌ ఫుల్‌ జోష్‌తో నడవనున్నాయి. మొదటివారం ఫర్వాలేదన్పించిన చిరంజీవి, రెండో వారానికొచ్చేసరికి 'షో'ని ఎలా పరుగులు పెట్టిస్తారో వేచి చూడాల్సిందే.

Show comments