ఐటమ్‌ సాంగ్‌కి 2 కోట్లు.!

కన్నడలో తెరకెక్కిన 'జాగ్వార్‌' చిత్రం తెలుగులోనూ హాట్‌ టాపిక్‌ అయ్యింది. తమిళంలోనూ ఈ చిత్రాన్ని భారీ పబ్లిసిటీతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా ఒకేసారి మూడు భాషల్లో సినిమాని విడుదల చేసి, తన కుమారుడికి తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్‌ తెచ్చిపెట్టాలన్నది కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యూహం. 

కుమారస్వామి తనయుడు నిఖిల్‌ హీరోగా 'జాగ్వార్‌' తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఓ ఐటమ్‌ సాంగ్‌ని ప్లాన్‌ చేశారు. ముందుగా ఈ ఐటమ్‌ సాంగ్‌ కోసం శృతిహాసన్‌ని సంప్రదించారట కూడా. రెండు కోట్లు ఆఫర్‌ ఇచ్చినా డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక ఆ ఆఫర్‌ని శృతిహాసన్‌ వదులుకుందనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క, ఇలాంటి బంపర్‌ ఛాన్స్‌లను దక్కించుకోవడంలో దిట్ట అయిన మిల్కీ బ్యూటీ వద్దకు ఈ ఆఫర్‌ వచ్చిందని తెలుస్తోంది. 

తెలుగులో తమన్నా 'అల్లుడు శీను' సినిమా కోసం భారీ రెమ్యునరేషన్‌ తీసుకుని ఐటమ్‌ బాంబ్‌ అవతారమెత్తింది. అదొక్కటే కాదు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తోనే 'స్పీడున్నోడు' సినిమాలోనూ ఆడి పాడింది. ఈ రెండు సినిమాల కోసం అప్పట్లో తమన్నా చెరో కోటికి పైగానే రెమ్యునరేషన్‌ అందుకుందన్న ప్రచారం జరిగింది. ఆ సినిమాల్లో మిల్కీ బ్యూటీ ఐటమ్‌ సాంగ్స్‌ సూపర్‌ హిట్‌ అవ్వడంతో 'జాగ్వార్‌' సినిమాకి తమన్నా పేరుని ఫిక్స్‌ చేశారట. 

Show comments