గీతా జనాలపై బన్నీ గుస్సా?

అల్లు అర్జున్ సినిమాలు అంటే ఆషామాషీగా తయారు కావు. కథ దగ్గరే చాలా వ్యవహారాలు నడుస్తాయి. పూర్తిగా శాటిస్ ఫై అయ్యేదాకా కథ సెట్ మీదకు వెళ్లదు. అలా వెళ్లిన తరువాత కూడా సినిమా పాటలు, ఫైట్లు, స్టయిల్ ఇలా అన్ని విషయాల్లో బన్నీ స్వయంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఇదిలా వుండగా, మరో పక్క గీతా సంస్థలోని కీలక బాధ్యులు కూడా బన్నీ సినిమా ఎలా వస్తోంది అన్న విషయమై ఓ కన్నువేసే వుంచుతారు. కానీ డిజె సినిమా విషయంలో గీతా కీలక బాధ్యులు అంత చొరవగా లేరని వినికిడి.

దిల్ రాజు స్వయంగా అల్లు అరవింద్ దగ్గర తన మొహమాటం అంతా ఉపయోగించి డిజె ప్రాజెక్టు ఫిక్స్ చేసుకున్నారని వినికిడి. అయితే ఆ తరువాత సినిమా విషయంలో బన్నీకి మినహా మిగిలిన ఎవరికీ ఏం జరుగుతోందో ప్రమేయం లేని పరిస్థతి వుందని వినికిడి.

ఈ సినిమా విషయంలో అందుకే గీతాలోని కీలక బాధ్యులు పెద్దగా కలుగచేసుకోలేదని తెలుస్తోంది. అయితే సినిమా ఫినిష్ అయిన తరువాత మరేమయిందో తెలియదు కానీ, బన్నీ మాత్రం కొందరు గీతా కీలక వ్యక్తులపై చిన్నగా గుస్సాయించినట్లు తెలుస్తోంది.

‘మీరు ఏం పట్టించుకోవడం లేదు. సినిమా ఎలా వస్తోందో గమనించడం లేదు’ అని అన్నట్లు వినికిడి. ‘అదేం లేదని, దిల్ రాజు ప్రొడక్షన్ కనుక ఇన్ వాల్వ్ కాలేదని’ వారు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమాధానంతో బన్నీ అంతగా సంతృప్తి చెందినట్లు లేదని తెలుస్తోంది.

ఇదిలా వుంటే దిల్ రాజు ప్రొడక్షన్ తో గీతా సంస్థకు పెద్ద సమస్య లేదని, డైరక్టర్ హరీష్ శంకర్ తో ఎందుకో గీతా జనాలకు అంతగా సింక్ కాలేదని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏమయినా డిజె రిజల్ట్ బాగుంటే అన్నీ సమసిపోతాయి. తేడా వస్తే, మాత్రం అన్ని విషయాలు గుప్పు మనే అవకాశం వుంది.

Show comments