డబ్బింగ్‌ చెప్పేసుకుంటోందా.!

తొలి సినిమాకే తెలుగులో డబ్బింగ్‌ చెప్పేసింది మలయాళ బ్యూటీ సాయి పల్లవి. 'ఫిదా' సినిమా కోసం అతి కష్టమైన తెలంగాణ స్లాంగ్‌లో సాయి పల్లవి డబ్బింగ్‌ చెప్పేసి అందర్నీ విస్మయానికి గురిచేసింది. చాలావరకు మలయాళం నుంచి వచ్చిన భామలు తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడేయడం, వీలైతే డబ్బింగ్‌ చెప్పేయడం చేస్తుంటారు. ఈ లిస్ట్‌లో కన్నడ భామలకీ మంచి ట్రాక్‌ రికార్డే వుంది. ముంబై ముద్దుగుమ్మలు మాత్రం తెలుగులో డబ్బింగ్‌ చెప్పడం చాలా చాలా అరుదు. 

ఇక, అసలు విషయానికొస్తే, 'రాజుగారిగది-2' సినిమాలో నాగార్జున సరసన నటిస్తోన్న 'రన్‌ రాజా రన్‌' మూవీ ఫేం సీరత్‌కపూర్‌, సోషల్‌ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్‌ ఫొటో షేర్‌ చేసింది. 'రాజుగారిగది-2' డబ్బింగ్‌ గురించిన ఫొటో అది. డబ్బింగ్ ఫర్ ‘రాజుగారి గది-2’ అంటూ ఈ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సీరత్ కపూర్.

మంచి డాన్సర్‌ కూడా అయిన సీరత్‌కపూర్‌లో సింగింగ్‌ టాలెంట్‌ కూడా దాగి వుందట. ముందు ముందు ఆ టాలెంట్‌ కూడా బయటపెడ్తానంటోంది. మొత్తమ్మీద, 'రాజుగారిగది-2' సినిమా కోసం సీరత్‌కపూర్‌ సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోవడమంటే విశేషమే మరి.

Show comments