పవన్కళ్యాణ్ సరసన 'పులి' సినిమాలో నటించిన నికీషా పటేల్ గుర్తుందా.? కళ్యాణ్రామ్ హీరోగా వచ్చిన 'ఓం' సినిమాలోనూ, పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన 'అరకు రోడ్లో' సినిమాలోనూ నటించినా, హీరోయిన్గా తెలుగు తెరపై తగిన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది ఈ హాటీ. హాట్నెస్కి కేరాఫ్ అడ్రస్ అన్పించేలా తెరపై హాట్ అప్పీల్ అయితే పండించిందిగానీ, ఆ హాట్నెస్ అస్సలేమాత్రం తనకు నచ్చదంటోంది నికీషా పటేల్.
స్క్రీన్ మీద ఏం చేసినా, అది గుర్తింపు కోసమేనంటోన్న నికీషా, రియల్ లైఫ్లో తనకు అలాంటి హాట్ అప్పీల్ అస్సలు ఇష్టం వుండదనీ, గ్లామరస్గా కన్పిస్తే తద్వారా దక్కే గుర్తింపుతో అవకాశాలు వస్తాయనీ, ఆ తర్వాత నటిగా ప్రూవ్ చేసుకోవడం తేలికనీ నికీషా పటేల్ చెబుతోంది. అయితే, ఎన్ని అవకాశాలొచ్చినా, అవన్నీ తనలోని గ్లామరస్ యాంగిల్నే చూపిస్తున్నాయని వాపోతోంది ఈ బ్యూటీ.
'కొన్ని సినిమాల కోసం బొద్దుగా తయారవ్వాల్సి వస్తోంది.. అది ఒక్కోసారి ఇబ్బందికరంగా మారుతోంది. తమిళ, కన్నడ సినిమాల్లో బొద్దుగా వుంటే ఇష్టపడ్తారు.. తెలుగులో కొంచెం స్లిమ్గా వుండాలి, అలాగని మరీ బక్కపలచగా వుంటే కష్టమే.. నాకు మాత్రం వ్యక్తిగతంగా స్లిమ్గా వుండటమే ఇష్టం..' అని చెప్పే నికీషా, బాలీవుడ్ నుంచి ఛాన్సులొస్తున్నాయంటోంది. హాలీవుడ్ సినిమాల్లో నటించాలన్నది నికీషా డ్రీమ్ అట. బ్రిటన్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అయిన ఈ ఇండో - బ్రిటన్ బ్యూటీ హాలీవుడ్ సినిమాల్లో ఛాన్సొస్తే హాట్గా కన్పించకుండా వుంటుందా.? ఛాన్సే లేదు.