హరీష్ ..లైన్ మాత్రమే చెప్పారా?

హరీష్ శంకర్..బన్నీ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించే సినిమా ఇంతవరకు ముందుకు కదలలేదు. ఆగస్టులో ప్రారంభం అవుతుందేమో అనుకున్నారు కానీ అలా జరిగేలా లేదు. సెప్టెంబర్ లో ప్రారంభం అవుతుందని వినిపిస్తోంది. కానీ డవుట్ గానే వుంది. సమ్మర్ రిలీజ్ అని ఫిక్సయిపోయారు కాబట్టి గాభరా పడడం లేదు అని అంటున్నారు. సెప్టెంబర్ లో ప్రారంభించే అవకాశం తక్కువ అని మరో మాట. 

ఎందుకంటే సాధారణంగా భాద్రపదం మాసంలో ముహుర్తాలు తక్కువ వుంటాయని అంటున్నారు. ఈ గుసగుసలు అన్నీ ఇలా వుంటే, దర్శకుడు హరీష్ శంకర్ కేవలం బన్నీ కి లైన్ మాత్రమే చెప్పాడని, స్క్రిప్ట్ ఇంకా తయారీ దశలో వుందని తెలుస్తోంది. ఈ ఫుల్ స్క్రిప్ట్ ఇంకా బన్నీకి, అరవింద్ గారికీ ఇద్దరికీ నెరేషన్ ఇవ్వాల్సి వుందని తెలుస్తోంది. అరవింద్ కు నెరేషన్ ఇచ్చినా, బన్నీకి ఇచ్చినా, ఇద్దరికీ నచ్చిన తరువాతే ప్రాజెక్టు సెట్ మీదకు వెళ్లేది. 

వాళ్లు చెప్పిన మార్పులు చేర్పులు జరిగాకే అసలు కథ మొదలయ్యేది. సరైనోడు విషయంలో కూడా ఇదే జరిగింది. పైగా ఈ సినిమా నిర్మాత దిల్ రాజు మూడు నాలుగు ప్రాజెక్ట్ ల్లో ఫుల్ బిజీగా వున్నారు. అందువల్ల ఇవన్నీ లెక్కేసుకుంటే ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కాలంటే కాస్త టైమ్ పట్టేలాగే వుంది.

Show comments