తెలుగులో 'బోణీ' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి కర్బందా, పెద్ద హీరోలతో నటించినా స్టార్ హీరోయిన్ అవలేకపోయింది. పవన్కళ్యాణ్తో 'తీన్మార్', రామ్చరణ్ హీరోగా తెరకెక్కిన 'బ్రూస్లీ' (చరణ్కి అక్కగా నటించింది) చిత్రాల్లో నటించిన కృతి కర్బందా, ప్రస్తుతం బాలీవుడ్లో 'రాజ్' సినిమా చేస్తోంది.
'రాజ్' సిరీస్లో ఇప్పటిదాకా బాలీవుడ్లో మూడు సినిమాలొచ్చాయి. తాజాగా కృతి నటిస్తోన్నది నాలుగో సీక్వెల్. 'రాజ్ రీబూట్' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో కృతి కర్బందా హాట్ హాట్గా కన్పించనుందట. హర్రర్ థ్రిల్లర్ జోనర్లో 'రాజ్' సిరీస్ బాలీవుడ్లో సూపర్ పాపులర్ అయిన విషయం విదితమే.
మొట్టమొదటి 'రాజ్'లో బిపాసా బసు హీరోయిన్. ఆ సినిమా బిపాసా బసుకి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. బిపాసా గ్లామర్ ఆ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. 'రాజ్-2'లో కంగనా రనౌత్ హీరోయిన్. ఇందులో కంగనా గ్లామర్ ఓ రేంజ్లో వుంటుంది. 'రాజ్-3'లో బిపాసా బసు, ఇషా గుప్తా పోటీ పడి గ్లామర్ పండించేశారు.
ఇప్పుడిక 'రాజ్ రీబూట్'లో కృతి కర్బందా గ్లామర్ ఏ స్థాయిలో వుంటుందోగానీ, ఈ సినిమాతో కృతి బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుంటుందని 'రాజ్' యూనిట్ చెబుతోంది. 'రాజ్' తొలి సినిమాలో తప్ప, మిగతా సీక్వెల్స్ అన్నిటిలోనూ బాలీవుడ్ కిస్సుల వీరుడు ఇమ్రాన్ హష్మీనే హీరో.