సాయిథరమ్ నా? నాగార్జునా?

మాస్ యాక్షన్ ఎంటర్ టైనరా? పోలీస్ కాప్ ఎమోషనలా? ఇవీ చందు మొండేటి చాయిస్ లు. కార్తికేయ సినిమా తరువాత ప్రేమమ్ తో ద్వితీయ విఘ్నాన్ని దాటేసిన చందు ఇప్పుడు మూడో సినిమా మీద దృష్టి పెట్టారు. సినిమాకు నిర్మాత పక్కా. ఐ డ్రీమ్ మీడియా వాసుదేవ రెడ్డి నిర్మాత. అక్కడకు అది క్లియర్. 

కానీ హీరో ఎవరు అన్నదే ఇంకా డిసైడ్ కాలేదు. చందు దగ్గర కార్తికేయ 2 కాకుండా రెండు సబ్జెక్ట్ లు వున్నాయి. వాటిలో ఒకటి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇది సాయి ధరమ్ తేజ లాంటి హీరోకి సూటయ్యే సబ్జెక్ట్.  మరోకటి పోలీస్ ఆఫీసర్ సబ్జెక్ట్. నాగార్జున, వెంకీ లాంటి వాళ్లకు సూటయ్యే సబ్జెక్ట్. మరి ఈ రెండింటిలో దేనిమీద ముందుకు వెళ్లాలన్నది ఇంకా డిసైడ్ కాలేదు. నాగార్జున కనుక తాను రెడీ అంటే సరే, లేదంటే రెండో సబ్జెక్టే  తెరపైకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

Show comments