రామోజీ ఇంట శ్రీపురం అమ్మవారి పూజలు?

మీడియా మొఘల్ రామాజీరావు వి కాస్త కమ్యూనిస్టు భావనలు కానీ, ఆయన భార్య, కొడుకులు, కోడళ్లు వేరు. వాళ్లంతా నికార్సయిన భక్తి తత్పరతలు వున్నవారు. భార్య రమాదేవి ఆంజనేయస్వామి భక్తురాలు. ఇధ్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు వెంకటేశ్వరస్వామికి భక్తులు. అందుకే వీరి హయాం వచ్చాకే ఈనాడులో జ్యోతిష ఫలితాలు, ఆద్యాత్మిక వ్యాసాలు ప్రారంభమయ్యాయి. 

లేటెస్ట్ గా ఈ కార్తీక మాసంలో రామోజీరావు ఇంట తిరుపతి సమీపంలో శ్రీపురం అమ్మవారి పూజలు ఓ రోజు జరగబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీపురం నుంచి తెచ్చిన బంగారు అమ్మవారి విగ్రహాన్ని హైదరాబాద్ లో పక్షం రోజుల పాటు పలువురు బడా సినీ, మీడియా, పారిశ్రామిక వేత్తల ఇళ్లో పూజలు చేస్తున్నట్లు బోగట్టా. 

ఇలా పూజలు చేయించుకుంటున్న వారిలో ఓ చానెల్ అధినేత, ఓ నిర్మాత, ఓ బడా రియల్టర్, కూడా వున్నట్లు తెలుస్తోంది. అలాగే రామోజీ కుటుంబం కూడా. ఒక్కో రోజు ఒక్కొక్కరి ఇంట్లో వంతున 15 రోజుల పాటు 15 ఇళ్లలో అమ్మవారిని ఉంచి పూజలు చేస్తారన్నమాట. అంతా డబ్బు మహత్యం. శ్రీపురం బంగారు అమ్మవారు సామాన్యుల ఇళ్లకు రావడం సాధ్యమా?

Show comments