గీతా ఆర్ట్స్‌లో చిరంజీవి.?

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం విదితమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. తమిళ సినిమా 'కత్తి'ని తెలుగులోకి మెగాస్టార్‌తో రీమేక్‌ చేస్తున్నాడు దర్శకుడు వినాయక్‌. ఈ సినిమా నిర్మాణంలో వుండగానే, మరో సినిమా చేయాలనే పట్టుదలతో వున్న చిరంజీవి, ఆ సినిమాని కూడా పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

గీతా ఆర్ట్స్‌లో అల్లు అరవింద్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తాడట. వాస్తవానికి చిరంజీవి హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మాతగా సినిమా రావాల్సి వుంది. కొన్ని కారణాలతో పూరి జగన్నాథ్‌ సినిమా ప్లేస్‌లోకి వినాయక్‌ సినిమా వచ్చి చేరింది. అఫ్‌కోర్స్‌.. అంతకన్నా ముందే చిరంజీవి కోసం వినాయక్‌ అంతా సిద్ధం చేశాడనుకోండి.. అది కూడా అటకెక్కింది. 

అయితే, పూరి - చిరంజీవి సినిమా విషయంలో ఇంకా కన్‌ఫ్యూజన్‌ కొనసాగుతూనే వుంది. చిరంజీవి నుంచే తదుపరి సినిమా పట్ల 'వేగం' కన్పిస్తుండడంతో, మెగా క్యాంప్‌కీ పూరికీ మధ్య ఇంతకు ముందు క్రియేట్‌ అయిన గ్యాప్‌ అంతా రికవరీ అయిపోయేందుకే అవకాశాలు ఎక్కువ. అన్నీ కుదిరితే, అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ని అనౌన్స్‌ చేసేస్తారనీ, దసరా నుంచి సినిమా షూటింగ్‌ని కూడా ప్రారంభించేస్తారనీ తెలుస్తోంది.

Show comments