నాకు నోటీసులు రాలేదు, వదిలేయండి ప్లీజ్

"మీకు దండం పెడుతున్నా. నన్ను వదిలేయండి ప్లీజ్. నాకు ఎలాంటి నోటీసులు రాలేదు. నన్ను పోలీసులు కలవలేదు. ఏమీ జరగలేదు. అలాంటివి ఉంటే నేను చెబుతాను. దయచేసి నా పేరు వేయొద్దు. నాకు సంబంధం లేదు". నటుడు తనీష్ ఆవేదన ఇది.

టాలీవుడ్ డ్రగ్స్ మాఫియాకు సంబంధించి పలు మాధ్యమాల్లో తన పేరు రావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు తనీష్. తన తల్లి చాలా బాధపడుతోందని, తండ్రి చనిపోయిన తర్వాత ఇంటికి తనే పెద్ద దిక్కుగా మారానని.. దయచేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండని మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నాడు తనీష్.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఎవరూ తనను సంప్రదించలేదన్న తనీష్.. నిజానికి డ్రగ్స్ కు వ్యతిరేకంగా సాగుతున్న అవగాహన సదస్సులో తను కూడా పాల్గొంటున్నట్టు చెప్పాడు.

"తప్పు ఎవరు చేసినా తప్పే. పోలీసులు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటున్నారు తప్ప ఏదీ నిర్థారణ చేసి చెప్పలేదు. నాకు నోటీసులు రాలేదు. వస్తే వెళ్లి పోలీసుల్నికలవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు కావాలని ఫోకస్ చేసి పేర్లు వేస్తున్నారు". అని అంటున్నాడు తనీష్.

Show comments