సెగలు పుట్టించేసిన శ్రద్ధాకపూర్‌

తెలుగులో 'ఓకే బంగారం' సినిమా ఫర్వాలేదన్పించింది. కుర్రాళ్ళని మాత్రం బాగా ఎట్రాక్ట్‌ చేసేసింది. దానిక్కారణం, సినిమాలోని ఓవర్‌ డోస్‌ శృంగారమే. 'నేనెప్పుడూ ఎక్స్‌పోజింగ్‌కి వ్యతిరేకమే..' అని చెప్పే నిత్యామీనన్‌, ఈ సినిమాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. దుల్కర్‌ సల్మాన్‌తో వెండితెరపై శృంగారం ఓ రేంజ్‌లో పండించేసింది. ఇప్పుడు ఇదే సినిమా బాలీవుడ్‌లో 'ఓకే జాను' పేరుతో రూపొందుతోంది. ఆదిత్య రాయ్‌ కపూర్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తున్నారీ చిత్రంలో. 

'ఓకే బంగారం' సినిమాతో పోల్చితే, పదింతల హాట్‌ అప్పీల్‌ 'ఓకే బంగారం' సినిమాలో కన్పిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, 'ఓకే జాను'లో హీరో హీరోయిన్లు ఇద్దరూ హద్దులు దాటేశారు. లిప్‌ టు లిప్‌ కిస్‌ సీన్స్‌ బాలీవుడ్‌లో మామూలే.. ఇంటిమేట్‌ సీన్స్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది.? అయినాసరే, హద్దులు దాటిన రొమాన్స్‌తో శ్రద్ధ, ఆదిత్య ఇప్పుడు ట్రైలర్‌తోనే బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయిపోయారు. 

షాద్‌ అలీ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఒరిజినల్‌తో పోల్చితే, హిందీలో రొమాన్స్‌ పరంగా తప్ప, ఇతరత్రా మార్పులు పెద్దగా ఏమీ వుండబోవట. జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ వచ్చిన కాస్సేపట్లోనే ఇంటర్నెట్‌లో సంచలనాలకు తెరలేపేసింది.

Show comments