ప్లాన్స్ వర్కవుట్ కాలేదంటున్న హీరోయిన్

అనుకున్నవన్నీ జరగవు. అదే జీవితం అంటోంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. కెరీర్ లో, వ్యక్తిగత జీవితంలో తను చాలా అనుకున్నానని, కానీ ఏదీ వర్కవుట్ కాలేదని ఆమె వెల్లడించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన మనసులో భావాల్ని బయటపెట్టింది.

సూపర్ హిట్టయిన బాయ్స్, ప్రేమించు సినిమాల్లో వరలక్ష్మినే హీరోయిన్ గా నటించాల్సింది. కానీ అప్పటికి ఆమె వయసు కేవలం 18 ఏళ్లు. అందుకే తండ్రి శరత్ కుమార్ సలహా మేరకు ఆ అవకాశాల్ని వరలక్ష్మి వదిలేసుకుందట.

ఆ తర్వాత 22 ఏళ్ల వయసులో హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఆమెకు చాలా తక్కువగా సక్సెస్ లు వచ్చాయి. సక్సెస్ మాట తర్వాత, ఆమెకు అవకాశాలిచ్చేవాళ్లు కూడా కరువయ్యారు. దీంతో ఆమె తెలుగు, కన్నడ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది.

22 ఏళ్ల వయసులో హీరోయిన్ గా మారిన వరలక్ష్మి.. 28 ఏళ్లకు స్టార్ హీరోయిన్ అయిపోవాలని టార్గెట్ గా పెట్టుకుందట. ఆ తర్వాత 32 ఏళ్లకు పెళ్లి చేసుకొని, 34 ఏళ్లకు పిల్లల్ని కనాలని ప్లాన్ చేసిందట. కానీ తను అనుకున్నదేదీ జరగలేదని ఆమె బాధపడింది.

ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్లు. ఇప్పుడు ఆమె పెళ్లికి సిద్ధమైంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త నికొలాయ్ సచ్ దేవ్ తో ఈమధ్య ఆమె నిశ్చితార్థం పూర్తయింది. త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటించబోతున్నారు.

తన అనుభవాల్ని రంగరించి నేటి తరానికి ఆమె ఓ ఉచిత సలహా ఇస్తోంది. జీవితాన్ని మనం ప్లాన్ చేయకూడదు, అది ఎటు తీసుకెళ్తే అటువైపు సాగాలి. పూర్తి సంతృప్తి కలిగేలా పనిచేయాలని అని సూచిస్తోంది.

Show comments

Related Stories :