ఎన్టీఆర్ కు విలన్ దొరికాడు

జై లవకుశ సినిమాలో మొన్నటివరకు దునియా విజయ్ ను విలన్ గా అనుకున్నారు. కానీ కొన్ని వివాదాలు, మరికొన్ని పైకి చెప్పని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి దునియా విజయ్ తప్పుకున్నాడు. అప్పట్నుంచి ఖాళీగా ఉన్న ఈ స్థానం ఎట్టకేలకు భర్తీ అయింది. దునియా విజయ్ స్థానంలో రోనిత్ రాయ్ అనే నటుడ్ని ఎంపిక చేశారు.

బాలీవుడ్ లో ఉదాన్, అగ్లీ సినిమాలతో పాపులర్ అయ్యాడు రోనిత్ రాయ్. ఇప్పుడీ నటుడు జై లవకుశ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. రోనిత్ రాయ్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాల్ని ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. ఈ షూట్ హైదరాబాద్ లోని ఓ క్వారీలో జరుగుతోంది.

జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ టైం నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. జై అనే ఈ క్యారెక్టర్ కోసం ఫారిన్ మేకప్ ఆర్టిస్టుల్ని తీసుకున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్, షట్టర్ ఐలాండ్ లాంటి సినిమాలకు పనిచేసిన ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ వెన్స్ హార్ట్ వెన్.. జై లవకుశలో ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా మేకప్ సిద్ధం చేశాడు.

రాశి ఖన్నా, నివేదా ధామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. వచ్చేనెల మొదటి వారంలో టీజర్ విడుదల చేయబోతున్నారు.

Show comments