టాలీవుడ్ డ్రగ్స్ మత్తులో ఊగిపోతోందంటూ ప్రచారం జరుగుతున్న వేళ, కొంతమంది ప్రముఖుల పేర్లు తెరపైకొచ్చాయి. అందులో అందాల భామ ఛార్మి పేరు కూడా విన్పిస్తోంది. 'ఒకప్పుడు హీరోయిన్గా చాలా సినిమాల్లో నటించి, ఇప్పుడు ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటోన్న..' అనగానే, అందరికీ ఆ పేరు ఛార్మిదేనని అర్థమయిపోయింది. ఈ పేరు ఇప్పుడు మీడియాలో మార్మోగిపోతోంది. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఛార్మితోపాటు పూరి జగన్నాథ్ పేరు కూడా విన్పిస్తుండడం.
పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా 'పిసి కనెక్ట్స్' పేరుతో నటీనటుల ఎంపిక ప్రక్రియ చేపడ్తున్న విషయం విదితమే. బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న 'పైసా వసూల్' సినిమా కోసం చాలామంది నటీనటుల్ని ఈ పీసీ కనెక్ట్స్ ద్వారానే ఎంపిక చేశారు. ఆ విషయం పక్కన పెడితే, తన గురించి మీడియాలో వస్తున్న గాసిప్స్పై ఛార్మి ముందుగానే స్పందించింది. అయితే, డైరెక్ట్గా కాదు.. ఇన్డైరెక్ట్గా.!
చూస్తున్నారుగా, పై ఫొటోలో ఛార్మి ఏం చెప్పిందో. ఇది ట్విట్టర్లో ఛార్మి పేర్కొన్న విషయం. 'మీమ్మల్ని ఎవరైనా కిందకి లాగాలనుకుంటున్నారంటే దానర్థం, వారికన్నా మీరు చాలా పైన ఎత్తులో వున్నట్లు..' అని అర్థం వచ్చేలా ఈ ట్వీట్ చేసింది ఛార్మి. అయితే, ఇంతవరకు ఛార్మి పేరుని ఎక్సయిజ్ ఎన్ఫోర్స్మెంట్ సిట్గానీ, టాస్క్ఫోర్స్గానీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఛార్మికి నోటీసులు వెళ్ళాయనీ, విచారణకు ఆమె హాజరు కాక తప్పదనే ప్రచారం జరుగుతోంది.
ఛార్మి సహా ఈ కేసులో విన్పిస్తోన్న మరో నటి ఇంకెవరో కాదు ముమైత్ఖాన్. ఈ ఇద్దరికీ సిట్ కార్యాలయంలో కాకుండా, వారు కోరుకున్న చోట సిట్ బృందం విచారించేలా చిన్నపాటి వెసులుబాటు కల్పించారట.