రైతు సినిమాపై బాలయ్య పునరాలోచన?

తన వందో సినిమాగా రైతు సినిమా చేయాలని అనుకున్నారు బాలకృష్ణ. కథ రెడీగా వుంది. సాక్షి మీసాల రామ్ రెడ్డి అందించిన కథ ఇది. కృష్ణ వంశీని పిలిచి దర్శకత్వం చేయమని కూడా చెప్పేసారు. అయితే లాస్ట్ మినిట్ లో క్రిష్ వచ్చి, శాతకర్ణి కథ చెప్పడంతో సీన్ అంతా మారిపోయింది. 101వ సినిమా గా రైతు కథను సినిమా చేస్తారు బాలకృష్ణ అని అనుకుంటున్నారు సినిమా జనాలు. 

అయితే ఈ కథపై బాలకృష్ణ పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల కథ అనగానే ఎంత కాదన్నా వారి కష్టాలు, ప్రభుత్వ విధానాలు, వాటితో సమస్యలు ఇవన్నీ అందులోకి రాక తప్పదు. 2017లో ఇలాంటి సినిమా చేయడం అంటే ఎన్నికలు కాస్త దూరంలో పెట్టుకుని, అనవసరంగా రైతుల సమస్యలను కెలకడం లాంటిది. అందుకే దాన్ని పక్కన పెట్టి, రెగ్యులర్ ఫార్మాట్ మాస్ సినిమానే కాస్త మెసేజ్ వున్నది చేస్తే ఎలా వుంటుందని బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

కృష్ణ వంశీ కూడా తన నక్షత్రం సినిమా హడావుడిలో వున్నారు. అది ఆయన ప్రారంభించి, ఫినిష్ చేసేసరికి ఎలా లేదన్నా మరో ఏడెనిమిది నెలలు పడుతుంది. అందువల్ల బాలయ్య 101 వ సినిమాకు కృష్ణవంశీ అందుకో లేకపోవచ్చు.

Readmore!
Show comments