ఎట్టకేలకు లాభాల్లోకొచ్చిన నందమూరి హీరో

ప్రస్తుతం నందమూరి హీరోల్లో భారీ నష్టాలు చవిచూస్తున్నది కల్యాణ్ రామ్ మాత్రమే. అటు హీరోగా హిట్స్ లేక, ఇటు నిర్మాతగా లాభాలు అందక... చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. కిక్-2, ఇజం లాంటి రెండు డిజాస్టర్ల తర్వాత ఇక కల్యాణ్ రామ్ కోలుకోలేడని అంతా అనుకున్నారు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎన్టీఆర్ తో సినిమా ఎనౌన్స్ చేశాడు కల్యాణ్ రామ్. ఈ మూవీ సెట్స్ పై ఉంటుండగానే లాభాలు కళ్లజూస్తున్నాడు.

కల్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై "జై లవకుశ" సినిమా చేస్తున్నాడు తారక్. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ప్రీ-రిలీజ్ బిజినెస్ లో జై లవకుశ సినిమా అదరగొడుతోందట. జనతా గ్యారేజ్ సినిమాను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను దాదాపు 70-75 కోట్ల రూపాయలకు కోట్ చేశారట. ప్రస్తుతం టేబుల్ ప్రాఫిట్స్ తో ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది.

జై లవకుశ ప్రాజెక్టుతో దాదాపు అన్ని అప్పుల నుంచి బయటపడ్డాడు కల్యాణ్ రామ్. ఈ సినిమా తర్వాత మరికొందరు స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నాడట ఈ నందమూరి హీరో.

Show comments