కాజల్‌ మల్ళీ చెల్లెని లాక్కొస్తుందా.?

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. సంపత్‌ నంది దర్శకుడిగా తెరకెక్కించిన తొలి సినిమా 'ఏమైంది ఈవేళ' సినిమాలో వరుణ్‌ సందేశ్‌ సరసన నిషా అగర్వాల్‌ కనిపించింది. ఆ తర్వాత ఆదితో 'సుకుమారుడు' సినిమాలోనూ, వరుణ్‌ సందేశ్‌తోనే మరో సినిమాలోనూ నటించినా, ఆ తర్వాత అవకాశాల్లేక ఎంచక్కా పెళ్ళి చేసేసుకుంది. 

చెల్లెలి పెళ్ళయిపోతుంది కదా.? నీ పెళ్ళెప్పుడు.? అనడిగితే, 'అప్పుడే కాదు..' అంటూ కాజల్‌ తన పెళ్ళి వ్యవహారాన్ని దాటవేసేస్తోందనుకోండి.. అది వేరే విషయం. హీరోయిన్‌గా తాను మంచి పొజిషన్‌లో వుండడంతో తెలుగు, తమిళ నిర్మాతలకీ, హీరోలకీ, దర్శకులకీ తన చెల్లెలి పేరుని అప్పట్లో కాజల్‌ రికమెండ్‌ చేసింది. ఇప్పుడు మళ్ళీ కాజల్‌, తన చెల్లెల్ని ప్రమోట్‌ చేసే పనిలో బిజీగా వుందట. 

తాజాగా, చిరంజీవితో 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా షూటింగ్‌ కోసం విదేశాలకు వెళ్ళిన కాజల్‌, తనతోపాటుగా తన చెల్లెలు నిషా అగర్వాల్‌ని కూడా తీసుకెళ్ళింది. ఏమో, మళ్ళీ నిషా తెలుగు తెరపై రీ-ఎంట్రీ ఇస్తుందేమో.!

Show comments