పాట రచయితగా రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్ తరుణ్ కొత్త అవతారం ఎత్తాడు. తన లేటెస్ట్ మూవీ కిట్టుగాడు కోసం ఓ పాట రాసేసాడు. బేసిక్ గా రైటర్ అయిన రాజ్ తరుణ్ ప్రారంభంలో డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో ప్రవేశించాడు. అక్కడి నుంచి హీరోగా మారాడు. హీరో అయినా కూడా కథలు రాసుకోవడం, కథలపై జాగ్రత్త తీసుకోవడం మానలేదు. 

లేటెస్ట్ గా అత్యవసరమై తన సినిమా కోసం తనే పాట కూడా రాసేసాడట. కిట్టుగాడు సినిమాలో అమ్మాయిల వైనంపై ఓ పాట సిట్యువేషన్ వుంది. దాని కోసం ఎవరో రైటర్ని అడిగారు. ఎంతకీ పాట రాలేదు. ఖాళీగా వున్న టైమ్ లో ఇలా వుంటే బాగుంటుందని అనుకుంటూ పెన్ను పట్టుకున్నాడట. పాట వచ్చేసింది. 

సరే, అని నలుగురికి వినిపించి, బాగుందని ఓకె అన్నాక సినిమాలో ఫిక్స్ చేసేసారట. అయితే ఈ విషయం బయటకు పొక్కుకుండా వుంచాలని అడియో ఫంక్షన్ లో వెల్లడించాలని అనుకుంటున్నారు. కానీ ముందే బయటకు తెలిసిపోయింది. దొంగాట వంశీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ లో విడుదలకు రెడీ అవుతోంది.

Show comments