జనతా గ్యారేజ్ లో 6 పాటలు

మరో రెండు రోజుల్లో జనతాగ్యారేజ్ పాటలు అభిమానుల ముందుకు రాబోతున్నాయి. కొరటాల శివ-దేవీ శ్రీ ప్రసాద్ కాంబోలో ఇది మూడో ఆల్బమ్. జనతా గ్యారేజ్ కోసం దేవీ మాంచి సూపర్ డూపర్ ట్యూన్ లు ఇచ్చాడని ఇన్ సైడ్ టాక్. ట్యూన్ ల సంగతి ఎలా వున్నా, ఆల్బమ్ లో మొత్తం ఆరు పాటలు వుంటాయట. అయిదు ఫుల్ లెంగ్త్ సాంగ్స్, ఒకటి బిట్ సాంగ్. ఆ బిట్ సాంగ్ జస్ట్ వన్ మినిట్ మాత్రమే వుంటుంది. 

శంకర్ మహదేవన్, సుక్విందర్, రఘు దీక్షిత్ ముగ్గురు మూడు పాటలు పాడారు. మొత్తం పాటల పిక్చరైజేషన్ ఓ లెక్కలో వుండేలా చూసాడట కొరటాల శివ. తన స్టయిల్ పిక్చరైజేషన్ తో పాటు, మ్యూజిక్ మూడ్ ను కూడా దృష్టి లో పెట్టుకుని, పాటలకు నేపథ్యం తీసుకున్నాడట. ఈ ఆరుపాటలు మరో రెండు రోజుల్లో అడియో రిలీజ్ ఫంక్షన్ లో బయటకు రాబోతున్నాయి. 

ఇదిలా వుంటే కేరళ షూట్ ముగించుకుని, రెండు రోజుల కిందటే వెనక్కు వచ్చింది గ్యారేజ్ టీమ్. వచ్చిన దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ మీద పడింది. పాటల ఫైనల్ మిక్సింగ్ ఇప్పుడు జరుగుతోంది. అడియో ఫంక్షన్ కాగానే మాగ్జిమమ్ రెండు వారాల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి, పబ్లిసిటీ మీదకు వెళ్లాలన్నది యూనిట్ ఆలోచనగా తెలుస్తోంది.

Show comments