పవన్ బాబు సెట్ మీదకు వస్తున్నారహో

ఎంత అభ్యుదయ భావాలు వున్నా ముహుర్తాలు ముహుర్తాలే. అందుకే ఈనెల ఫస్ట్ వీకెండ్ లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తాజా సినిమాను జస్ట్ టూ డే స్ షూటింగ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేవలం ముహుర్త కోసం తొలి రోజు, ద్వితీయ విఘ్నం లేకుండా రెండో రోజు షూటింగ్ చేసి, విరామం ప్రకటిస్తారని తెలుస్తోంది. 

ఆ తరువాత మళ్లీ నెలాఖరులో కానీ, మూడో వారంలో కానీ ఫుల్ లెంగ్త్ షూటింగ్ ప్రారంభిస్తారట. ఇప్పటికి ఈ రెండు రోజులు (ఆరేడు తేదీలు?) పక్కా. ఆ తరువాత సంగతి పవన్ మూడ్ ను బట్టి వుంటుంది. సర్దార్ గబ్బర్ సింగ్ తరువాత ప్రకటించిన ఈ సినిమా ఇదిగో అదిగో అంటూ అలా ఎక్కడ వేసినది అక్కడే వుంటోంది. ఈలోగా డైరక్టర్ మారారు. 

మరి ఇది ఎప్పుడు పూర్తవుతుందో, త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో? అన్నట్లు లైన్లో ఎఎమ్ రత్నం సినిమా కూడా వుంది. అదెప్పుడో? అభిమానులు అన్నింటి కోసం అలా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిందే.

Show comments