సప్తగిరి థియేటర్ల పెంపు

మిక్స్ డ్ సమీక్షలతో జనం ముందుకు వచ్చిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ ను బి సి సెంటర్ల జనం బాగానే ఆదరిస్తున్నారు. పైగా వంగవీటి థియేటర్లు కొన్ని ఖాళీ కావడం సప్తగిరి ఎక్స్ ప్రెస్ కు పనికి వచ్చింది. మండే నుంచి మరో యాభై థియేటర్లు పెంచుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత రవికిరణ్ కూడా ప్రకటించారు.

సప్తగిరి హీరోగా నటించిన ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి మంచి రెవెన్యూ వస్తోందని, కావాలంటే, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా చెక్ చేసుకోవచ్చని, ఆయన ప్రకటించారు. ప్రతి బి సి సెంటర్లలో ఈవారం విడుదలైన సినిమాల్లో సప్తగిరి కలెక్షన్లు స్టడీగా వున్నాయని, అదే జనంలో  సినిమాకు వున్న ఆధరణకు అద్దంపడుతోందని ఆయన తెలిపారు. 

సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న విశేష ఆదరణ నేపథ్యంలో థియేటర్ల సంఖ్య 300 నుంచి 350కి పెంచినట్లుగా నిర్మాత రవికిరణ్  ప్రకటించారు. ఇంతటి ఊహించని విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

విడుదలైన ప్రతి థియేటర్లో రెండో వారం కచ్చితంగా రన్ అవుతుందని, అదే సప్తగిరి ఎక్స్ ప్రెస్ విజయానికి నిదర్శనమని, ఇది కేవలం ప్రకటన కాదని, ఈ వాస్తవానికి ఎవరైనా చెక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

Show comments