రిక్టర్ స్కేల్ పగిలిందా.. త్వరలోనే తెలుస్తుంది

రాదనుకున్న సినిమా రెడీ అయింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన గోపీచంద్-నయనతార సినిమా సరికొత్త టైటిల్ తో ముస్తాబైంది. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ లాంచ్ చేశారు. తమిళ దర్శకుడు భూపతి పాండ్యన్ శంకుస్థాపన చేసిన ఈ సినిమాను ఫైనల్ గా బి.గోపాల్ పూర్తిచేశారు. ఈనెలలోనే రిలీజ్ చేస్తామంటున్నారు.

ఈ సినిమాకు మొదట జగన్మోహన్ ఐపీఎస్ అని పేరుపెట్టారు. కానీ మధ్యలో స్క్రిప్ట్ తో పాటు దర్శకుడు కూడా మారిపోయాడు. దీంతో తాజాగా సినిమాకు మరో టైటిల్ ఫిక్స్ చేశారు. అదే ఆరడుగుల బుల్లెట్. పవన్ కల్యాణ్ పాటలోని టైటిలే ఇప్పుడు గోపీచంద్ సినిమా అన్నమాట.

అంతా బాగానే ఉంది కానీ ఆరడుగుల బుల్లెట్ సినిమా ఈనెలలో థియేటర్లలోకి వస్తుందా రాదా అనేదే పెద్ద డౌట్. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించి ఇంకా టాకీపార్ట్ బ్యాలెన్స్ ఉంది. సాంగ్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. 2 పాటల షూట్ కోసం పోర్చుగల్ వెళ్తామని ప్రకటించినా అదింకా స్టార్ట్ కాలేదు.

Show comments