రామ్ చరణ్ ఛలో యుఎస్

ధృవ సినిమా హడావుడి మొదలయింది. రేపే సినిమా ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్. దీంతో సినిమాకు ఫుల్ బజ్ గ్యారంటీ. ఫంక్షన్ అయిన రెండు రోజుల్లోనే హీరో రామ్ చరణ్ అమెరికాకు వెళ్లిపోతున్నారు. అక్కడ ఈ సినిమా ప్రీమియర్లు, వాటి వ్యవహారంపై దృష్టి పెట్టేందుకు రామ్ చరణ్ ముందుగా వెళ్తున్నారు. 

మరి ఇక్కడ ప్రచారం సంగతేమిటో? ఎందుకంటే ఇంకా ధృవకు సంబంధించి మీడియా మీట్ జరగలేదు. విజవల్ మీడియా ఇంటర్వూలు స్టార్ట్ కాలేదు. బహుశా వెళ్లేముందు జస్ట్ ఓ సారి మీడియాతో ఇంట్రాక్ట్ అవుతారేమో? లేదా మాంచి లీడింగ్ ఏంకర్ ను ఎంచుకుని, ఆమె సంధించే పాజిటివ్ క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చి, దాన్నే అన్ని మీడియాలకు విడుదల చేస్తారో? అయితే సినిమా ప్రచారం వ్యవహారం మాత్రం తమకేమీ పట్టనట్లు వున్నట్లుంది గీతాఆర్ట్స్ సంస్థ. 

ఫంక్షన్ వరకు తమ బాధ్యత అది పూర్తి చేస్తే చాలు, పబ్లిసిటీ వ్యవహారం ఆర్కా మీడియా సంస్థ చూసుకుంటుంది అంటున్నాయి గీతా వర్గాలు. ఈ సంస్థ అంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సన్నిహితలకు సంబంధించినది. నిర్మాత అరవింద్ ప్రమేయం పెద్దగా లేకుండానే రామ్ చరణ్ తన సినిమా వ్యవహారాలు ఈ సంస్థకు అప్పగించాలని గుసగుసలు వున్నాయి. 

Show comments