మహేష్ తో సినిమా.. మాటలకు అందని మౌనం

డీజే ప్రమోషన్ లో భాగంగా మీడియాతో కాసేపు ముచ్చటించింది పూజా హెగ్డే. ఈ సందర్భంగా డీజే కంటే మహేష్ సినిమా గురించే ఆమెను ఎక్కువ మంది ప్రశ్నించారు. మహేశ్ సినిమాలో నటిస్తున్నారట కదా..నిజమేనా అనే ప్రశ్న అందరి నుంచి కామన్ గా వ్యక్తమైంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో  ఓ సినిమా చేయబోతున్నాడు మహేష్. ఇది అతడి కెరీర్ లో 25వ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు గట్టిగా వినిపించింది. ఇదే విషయాన్ని ఆమెను అడగ్గా.. రాజకీయ నేతల టైపులో "నో కామెంట్" అంటూ సమాధానమిచ్చింది పూజ.

ప్రస్తుత పరిస్థితిలో దానిపై స్పందించలేనని పూజా చెప్పడంతో.. ఈ ప్రాజెక్టుపై ఎవరికి తోచిన రీతిలో వాళ్లు సమాధానం చెప్పుకున్నారు. మేకర్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పూజా హెగ్డే ఈ విషయాన్ని బయటపెట్టడం లేదని కొందరు అంటున్నారు.

మరికొందరు మాత్రం డీజే విడుదల టైమ్ లో మహేష్ మూవీ గురించి మాట్లాడ్డం ఇష్టం లేకనే పూజా ఇలా స్పందించిందని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మహేష్ తో మూవీకి సంబంధించి కాంట్రాక్ట్ ఇంకా ఓకే అవ్వలేదు. దానికింకా చాలా టైం ఉంది.

ప్రస్తుతం మహేష్ స్పైడర్ సినిమా కంప్లీట్ చేశాడు. కొరటాల శివ సినిమాను రేపట్నుంచి స్టార్ట్ చేస్తాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాతే వంశీ పైడిపల్లి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది తెలుస్తుంది. అప్పటివరకు పూజా హెగ్డేకు మౌనమే సమాధానం.

Show comments