ఫైనల్స్ లో ముగ్గురు.. ఒకరికి మాత్రమే ఛాన్స్

ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సాహోలో హీరోయిన్ బెర్త్ ఎవరిదనే విషయంపై త్వరలోనే సస్పెన్స్ వీడనుంది. ఈ మేరకు ముగ్గుర్ని ఫైనలైజ్ చేశారు మేకర్స్. వీళ్లలోంచి ఒకర్ని సెలక్ట్ చేసి ఈ నెలాఖరుకు ఎనౌన్స్ చేయబోతున్నారు. ఆ ముగ్గురే పూజా హెగ్డే, అనుష్క, మంజిమా మోహన్.

సాహో హీరోయిన్స్ లిస్ట్ లో అనుష్క పేరు ఎప్పట్నుంచో వినిపిస్తోంది. ప్రభాస్ మరోసారి అనుష్కను రిపీట్ చేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు పూజా హెగ్డే పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. తాజాగా ఇప్పుడీ లిస్ట్ లోకి మంజిమా మోహన్ కూడా చేరింది.

నాగచైతన్యతో సాహసం శ్వాసగా సాగిపో సినిమా చేసింది మంజిమా మోహన్. ఆ మూవీలో కాస్త లావుగా కనిపించినప్పటికీ.. ఈ మధ్య పిల్ల సన్నబడింది. గ్లామరస్ గా కనిపించడానికి ఎలాంటి దుస్తులైనా వేసుకోడానికి రెడీ అంటూ హాట్ గా స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసింది.

సాహో షూటింగ్ ఇప్పటికే మొదలైంది. విలన్ నీల్ నితిన్ ముఖేష్ పై కొన్ని సన్నివేశాలు తీశారు. త్వరలోనే రామోజీ ఫిలింసిటీలో మేజర్ షెడ్యూల్ మొదలవుతుంది. ఆ షెడ్యూల్ జరుగుతున్న టైమ్ లో హీరోయిన్ పేరును అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు.

Show comments