సాయిధరమ్ తేజ హీరోగా సునీల్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తిక్క' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్ట్లో సినిమాని విడుదల చేస్తామని హీరో సాయిధరమ్ తేజ ప్రకటించేశాడు కూడా. మొన్నీమధ్యనే 'సుప్రీం' సినిమా వచ్చింది. యావరేజ్ టాక్తో, మంచి వసూళ్ళు సొంతం చేసుకుంది 'సుప్రీం'. ఈ సినిమాతో సాయిధరమ్ తేజ మార్కెట్ బాగా పెరిగిపోయిందనే వాదన టాలీవుడ్ సర్కిల్స్లో విన్పిస్తోంది.
ఇక, 'తిక్క' సినిమా విషయానికొస్తే, ఇది కూడా పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ అట. సాయిధరమ్ సరసన మనారా చోప్రా, లారెస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. డాన్సుల విషయంలో ప్రతిసినిమాలానే ఈ సినిమాకి కూడా సాయిధరమ్ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నాడట. 'సుప్రీం' తర్వాత వస్తున్న సినిమా కావడంతో, 'తిక్క'కి బిజినెస్ ఆఫర్లు కూడా బాగానే వస్తన్నాయని తెలుస్తోంది.
తొలి సినిమా 'రేయ్' ఆలస్యంగా విడుదలయ్యిందిగానీ, లేదంటే సక్సెస్ల పరంగా సాయిధరమ్ ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టేసినట్లే లెక్క. ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టేస్తానంటున్నాడు సాయిధరమ్. అన్నట్టు, ఈ సినిమా కోసం ముందు అనుకున్నదానికన్నా కాస్త ఎక్కువగానే ఖర్చు చేసేశారట. అంతా 'సుప్రీం' ఎఫెక్ట్ అనుకోవాలేమో. ఓ మోస్తరు బడ్జెట్తో మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్న సాయిధరమ్, బడ్జెట్ పెంచుకుంటూ పోతే స్టార్డమ్ సొంతమవుతుందా.? తేడా కొట్టేస్తుందా.? ప్రస్తుతానికైతే సాయిధరమ్ సుడి నడుస్తోంది. అన్నీ కలిసొచ్చి, సాయిధరమ్ హిట్ కొట్టి, హ్యాట్రిక్ సొంతం చేసుకున్నా ఆశ్చర్య పోనక్కర్లేదు.