జూ.ఎన్టీఆర్‌కి పూరిపై.. అదే ఫీలింగ్

ఎన్టీఆర్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'టెంపర్‌' సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఆ మాటకొస్తే, అప్పటిదాకా హిట్‌కి మొహం వాచిపోయిన స్థితిలో వున్నానని ఎన్టీఆర్‌ చెప్పిన మాట వాస్తవమే. 'టెంపర్‌'తో నిజంగానే ఎన్టీఆర్‌లో చాలా మార్పులొచ్చాయి. కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌, కథల ఎంపికలో శ్రద్ధ, వీటన్నిటికీ తోడు సరికొత్త ప్రయోగాలు.. ఇవన్నీ 'టెంపర్‌' తర్వాతేనని చెప్పక తప్పదు. 

ఇక, హీరోగా తనకు 'టెంపర్‌' సినిమా ఇచ్చిన హిట్‌ ఎంతగా మేలు చేసిందో చాలా సందర్భాల్లో ఎన్టీఆర్‌ చెబుతూనే వున్నాడు. మాటల్లో తేడా లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట. 'టెంపర్‌' హిట్‌ నాలో ఉత్సాహాన్ని నింపింది.. అంటుంటాడు ఎన్టీఆర్‌. తాజాగా 'ఇజం' సినిమా ఆడియో విడుదల వేడుకలోనూ ఎన్టీఆర్‌ మరోసారి ఎమోషనల్‌ అయ్యాడు. 'పటాస్‌'తో ఇటీవలే విజయాన్ని అందుకున్న కళ్యాణ్‌రామ్‌కి 'ఇజం' సూపర్‌ హిట్‌ అందిస్తుందని ఎన్టీఆర్‌ ఆకాంక్షించాడు. 

'ఇజం' విషయానికొస్తే, 'మేడ్‌ బై పూరి' అన్నట్లుగా, ఇందులోనూ కళ్యాణ్‌రామ్‌ టిపికల్‌ హీరోయిజం ప్రదర్శించబోతున్నాడు. ఈ సినిమా కోసం కళ్యాణ్‌రామ్‌ని పూర్తిగా మార్చేశాడు పూరి. పూరి డిజైన్‌ చేసిన పాత్రలో కళ్యాణ్‌రామ్‌ ఒదిగిపోయినట్లే కన్పిస్తున్నాడు. మరి, ఎన్టీఆర్‌కి 'టెంపర్‌'లా కళ్యాణ్‌రామ్‌కి 'ఇజం'తో పూరి ఆ స్థాయి విజయాన్ని అందిస్తాడా.? వేచి చూడాల్సిందే.

Show comments