బాలీవుడ్ భామ కృతి సనన్ తెలుగులో మహేష్తో '1 నేనొక్కడినే' సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆమె చేసిన, మరో చిత్రం 'దోచెయ్'. ఇందులో నాగచైతన్య హీరో. మహేష్తో కృతి చాలా క్లోజ్గా మూవ్ అవుతోందని '1 నేనొక్కడినే' సినిమా టైమ్లో ప్రచారం జరిగింది. నాగచైతన్య 'దోచెయ్' సినిమా చేస్తున్నప్పుడూ కృతిపై కుప్పలు తెప్పలుగా గాసిప్స్ తెరపైకొచ్చాయి.
ఇక, బాలీవుడ్లో ఆమె చేసిన తొలి చిత్రం 'హీరోపంతి' సమయంలో అయితే, హీరో టైగర్ ష్రాఫ్ని వలలో పడేసుకుందనీ, సినిమా రిలీజయిన తర్వాత కూడా ఇద్దరి మధ్యా రిలేషన్ షిప్ కొనసాగుతోందనీ గాసిప్స్ విన్పించాయి. అప్పటికీ ఇప్పటికీ ఆ గాసిప్స్ అలానే వున్నాయి. ఎందుకిలా.? అనడిగితే, రొటీన్ సమాధానమే ఇస్తుంది కృతి సనన్. ''ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండాలంటే, ఏ హీరోతో అయినా కాస్త క్లోజ్గా మూవ్ అవక తప్పదు. అయితే, అది వృత్తిపరమైన స్నేహం మాత్రమే..'' అంటూ కృతి సనన్ ఎఫైర్ గాసిప్స్పై స్పందిస్తూ, చాలా లాజికల్గా వివరణ ఇస్తుంటుంది.
తాజాగా, కృతి సనన్ తన తాజా చిత్రం 'రబ్తా' కోసం హీరో సుషాంత్ సింగ్ రాజ్పుట్తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పాఠాల్లో బిజీ బిజీగా వుందట. ఇద్దరూ డేటింగ్లో వున్నారని బాలీవుడ్ సినీజనం చెవులు కొరుక్కుంటోంటే, 'నాన్సెన్స్..' అని కొట్టి పారేసింది కృతి సనన్. బాలీవుడ్ అయినా, సౌత్ సినిమా అయినా ఇలాంటి గాసిప్స్ మామూలే. అయితే కృతి సనన్ విషయంలో మాత్రం, ఈ గాసిప్స్ ఇంకా గట్టిగా విన్పిస్తుంటాయి. ఎందుకలా.? పైగా, డేటింగ్ గాసిప్స్కి కృతి కేరాఫ్ అడ్రస్గా మారిపోయిందంటే, ఆమెలో ఏదో మెస్మరైజింగ్ ఎలిమెంట్ వున్నట్టే.. అదే యంగ్ హీరోలు ఆమెకు ఎట్రాక్ట్ అయ్యేలా చేస్తోందని అనుకోవాలేమో.!