నాగబాబు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

మెగా బ్రదర్ నాగబాబు మరోసారి నిర్మాతగా సినిమాను రూపొందించనున్నాడని తెలుస్తోంది. దాదాపు ఆరు సంవత్సరాల  తర్వాత నాగబాబు నిర్మాతగా మారుతుండటం ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. “ఆరెంజ్’’ అట్టర్ ఫ్లాఫ్ తో నిర్మాతగా నాగబాబు కెరీర్ కు కామా పడింది.  

ఆ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టడం, ఖర్చుల అంచనాలు మించిపోవడం, పూర్తి డివైడ్ టాక్ తో కనీసం పోస్టర్ల ఖర్చులు కూడా వసూళు కాకపోవడంతో నాగబాబు ఆర్థికంగా దెబ్బతిన్నాడనే మాట వినిపించింది. అంతేనా.. ‘ఆరెంజ్’ సినిమా మెగా ఫ్యామిలీ లో చిచ్చునే పెట్టిందనే ప్రచారం కూడా సాగింది.

బాబాయ్ అన్ని కోట్లు పెట్టి నష్టపోయినా.. చరణ్ ఆయన కోసం మరో సినిమాను చేసేందుకు కూడా ముందుకు రాలేదనే మాటా వినిపించింది. అలాగే నాగబాబు ఆర్థిక కష్టాల్లో ఆదుకోవడానికి పవన్ కల్యాణ్ ముందుకు వెళ్లాడని .. దానిపై రేణూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ విడాకుల వరకూ వెళ్లిందనే మాటా మెగాభిమానుల నుంచి వినిపించింది.

ఆ ఒక్క ఫ్లాఫ్ మెగా ఫ్యామిలీపై అలా పరిపరివిధాలుగా ప్రభావం చూపించిందనే ప్రచారం ఉంది. ఆరెంజ్ వచ్చి ఆరేళ్లు గడిచిపోయాయి..ఈ కాలాన్ని అంతా విరామం తీసుకున్న నాగబాబు, ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమాను రూపొందించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లూ ఎన్టీఆర్ కాంపౌండ్ లో ఉండిన వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తోంది. ఇంతవరకూ నిర్మాతగా నాగబాబు తీసిన సినిమాలన్నింటిలోనూ చిరంజీవి, పవన్ కల్యాణ్, చరణ్ లు హీరోలుగా నటించారు. ఇప్పుడు తొలి సారి అల్లు అర్జున్ తో సినిమా తీస్తున్నాడాయన. 

Show comments