దిద్దుబాటు చర్యల్లో తిక్క

తిక్క. సాయి ధరమ్ తేజ లేటెస్ట్ మూవీ. సినిమా అలా అలా వచ్చి, విడుదలకు ముందు ట్రయిలర్ లాంచ్ లో ఒక్కసారికి సెట్ బాక్ కు లోనయ్యింది. కారణం ట్రయిలర్ కట్ ఆకట్టుకునేలా లేకపోవడమే. యూ ట్యూబ్ లో బాగానే హిట్స్ వస్తున్నాయని ఊరుకున్నారు ముందు. కానీ తరువాత తరువాత ఫీడ్ బ్యాక్ తెలిసింది. 

దాంతో ఇప్పుడు దిద్దుబాటు చర్యల్లో పడ్డారు. హడావుడిగా ట్రయిలర్ కట్ చేయడంతో తప్పు జరిగిందని, అందుకే మాంచి ట్రైలర్ ను శనివారం విడుదల చేయాలని యూనిట్ డిసైడ్ అయిందట. సినిమాను 13నే విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఈ లోగా మరో ట్రయిలర్ విడుదల చేసి, థియేటర్లు అన్నింటికీ పంపిస్తారట. 

ఇదిలా వుంటే తిక్క ఓవర్ సీస్ రైట్స్ ఫ్రీగా ఇచ్చామన్న ప్రచారం వాస్తవం కాదని, కోటి రూపాయలకు తమ బంధువులకే ఇచ్చామని, నిర్మాత బంధువులు అంతా అమెరికాలో వుండడంతో, వారు కావాలని ముందుకు రావడంతో వారికే ఇచ్చేసామని యూనిట్ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఈ సినిమాకు సునీల్ రెడ్డి దర్శకుడు. రోహిన్ రెడ్డి నిర్మాత.

Show comments