కాంగ్రెస్‌లో ఉత్సాహమా... తెలుగుదేశానికే తెలియాలి..!

మొత్తానికి కాంగ్రెస్‌ పార్టీకి మీ శ్రేయోభిలాషి అన్నట్టుగా మారారు తెలుగుదేశం అధినేత, ఆయన అనుకూల మీడియా వర్గాలు. ఆ మధ్య ఎప్పుడో చంద్రన్న సెలవిచ్చారు.. ఏపీలో కాంగ్రెస్‌ పుంజుకుంటోందని. ఆ తర్వాత ఇటీవల రాహుల్‌ సభ అనంతరం చంద్రబాబు మరోసారి ఆ మాట చెప్పారు. ఇక చంద్రబాబు అనుకూల పత్రికలు అయితే.. కాంగ్రెస్‌ సభ సూపర్‌ సక్సెస్‌ అని అనేసింది. ఏపీలో కాంగ్రెస్‌కు ఇక తిరుగులేదనేంత స్థాయిలో కథనాలను ఇచ్చింది.

మరి వీరు ఏం మాట్లాడినా, ఏం రాసినా దానికో లెక్క ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్‌కు ఉత్సాహం వచ్చేసింది, కాంగ్రెస్‌ బలపడుతోంది అనే మాటలతో వైకాపా బలహీనపడుతోంది అని చెప్పుకోవడమే ఈ కథనాల ఉద్దేశం. అయినా.. వైకాపా బలహీన పడిందని చెప్పడానికి, తెలుగుదేశం పార్టీ బలం పెరిగిందని చెప్పుకుంటే అదోముచ్చట. అలాగాక కాంగ్రెస్‌ బలం పెరిగిందంటారేమిటండీ బాబూ!

కాంగ్రెస్‌ బలం పెరిగిందని తెలుగుదేశం పార్టీ సెలబ్రేట్‌ చేస్తోంది అదీకథ. మరి కాంగ్రెస్‌ ఎంతమేరకు బలపడిందో తెలుగుదేశం పార్టీకే తెలియాలి. ఆ సంగతలా ఉంటే.. రాయలసీమలో కొంతమంది కాంగ్రెస్‌ నేతలు వైకాపా పడుతున్న పరంపర కొనసాగనుందని తెలుస్తోంది.

అతి త్వరలో కోట్ల కుటుంబం కాంగ్రెస్‌ను వీడే అవకాశాలున్నాయని సమాచారం. కర్నూలు మేయర్‌, కర్నూలు ఎమ్మెల్యే టికెట్‌ ఆఫర్లతో కోట్ల కుటుంబం వైకాపాలో చేరనుందని తెలుస్తోంది. మరి కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహం వచ్చిందని తెలుగుదేశం పార్టీ వాళ్లు అంటుంటే.. ఇదే సమయంలో ఆ పార్టీని కొంతమంది వీడుతుండటం విశేషమే

Show comments