అక్కినేని అఖిల్‌ 'మెట్రో' ముచ్చట్లు

అక్కినేని అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళింది. సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. హైద్రాబాద్‌ మెట్రో రైల్‌కి సంబంధించిన ఓ స్టేషన్‌లో సినిమా చిత్రీకరణ జరుగుతుండడం గమనార్హం. ఇలా, హైద్రాబాద్‌ మెట్రోలో షూటింగ్‌ జరుపుకున్న తొలి సినిమా అఖిల్‌దేనట. 

ప్రస్తుతం యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ విషయాల్ని స్వయంగా అఖిల్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌తో సినిమా కోసం పోరాట సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారట. యాక్షన్‌ సీన్స్‌ అంటే, ఫిజిక్‌ కండలు తిరిగి వుండాలి కదా.? డే టైమ్‌ షూటింగ్‌, ఈవినింగ్‌ అయితే వర్కవుట్స్‌తో తెగ కష్టపడిపోతున్నాడట అఖిల్‌. 

హీరోగా తొలి సినిమా 'అఖిల్‌' నిరాశపర్చడంతో, ఈ సినిమాని 'అఖిల్‌ రీలాంఛ్‌ మూవీ' అని ఇప్పటికే అక్కినేని నాగార్జున ప్రకటించేశాడు. స్వయంగా నాగార్జునే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 

Show comments