'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' ఇది ఓ తెలుగు సినిమా టైటిల్. యంగ్ హీరో రాజ్ తరుణ్, 'మజ్ను' బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రమిది. టైటిల్లోనే సినిమా కథేంటో చెప్పేశారు. ఆల్రెడీ సినిమా ఫస్ట్ లుక్ ఫొటోతో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చేసింది. ఇంకొంచెం క్లారిటీ ఇచ్చేశాడు 'కిట్టు' తాజా టీజర్తో.
ఇది టీజర్ అనాలో, సినిమా ప్రమోషన్ కోసం కొత్తగా షూట్ చేసిన వెరైటీ వీడియో ప్రోమో అనాలో మీరే డిసైడ్ చేసుకోండి. విషయమేంటంటే, టీజర్లో దాదాపుగా సినిమా గురించి చెప్పేశాడు రాజ్ తరుణ్. ఇందులో 'కిట్టు - కుక్కల కిడ్నాపర్'గా నటిస్తున్న ఈ యంగ్ హీరో, మనుషుల్ని కిడ్నాప్ చెయ్యడం కన్నా కుక్కల్ని కిడ్నాప్ చేయడం తేలిక అంటున్నాడు. మనుషుల్ని కిడ్నాప్ చేయాలంటే, దానికి పెద్ద స్కెచ్ వుండాలట. అదే, కుక్కల్ని కిడ్నాప్ చేయాలంటే సంకలో పెట్టుకుని ఆ పని చేసెయ్యొచ్చట. ఏం చెప్పావ్ బాసూ.. అన్పిస్తోంది కదా.!
కథ ఇంకా వుంది, కిడ్నాప్ చేసిన కుక్కల్ని విడిపించుకోవాలంటే కిడ్నాపర్ కిట్టుకి మేటర్ వందల్లో చెల్లించాలి. ఎంతైనా పెద్ద పాత నోట్లు పని చెయ్యట్లేదు కదా.! అదీ అసలు కథ. 500, 1000 రూపాయల నోట్లు ఇవ్వాలని చూస్తే, కిడ్నాపైన కుక్క సంగతి అంతేనట. భలే వాడేసుకున్నాడు కదా, పెద్ద పాత నోట్ల రద్దు వ్యవహారాన్ని.! ఎంతైనా, ఈ 'కిట్టు' భలే తెలివైనోడు సుమీ.!