సావిత్రిగా నిత్య మీనన్?

సావిత్రి జీవిత చరిత్ర ను తెరకెక్కించాలని యువ దర్శకుడు నాగ్ అశ్విన్ సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా అరుదు. అందునా సావిత్రి లాంటి మహానటి కథ అంటే, ఓ అద్భుతమైన నటి కావాలి. ఇప్పుడా చాన్స్ ను నటి నిత్య మీనన్ ను వరించినట్లు తెలుస్తోంది. అమె కన్నా మంచి పెర్ ఫార్మర్ ఎవరు వుంటారు. 

అయితే సావిత్రి అంత ఎత్తు లేకపోవచ్చు కానీ, మిగతా ఫిజిక్ సరిపోతుంది. నటన సంగతి సరే సరి. అయితే ఈ పాత్ర ఒకె చేయడానికి నిత్య రెండు కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఒకటి కేవలం కమర్షియల్ యాంగిల్ కోసం సావిత్రి డార్క్ షేడ్ మాత్రం చూపిస్తాము అంటే చేయనందట. బయోపిక్ అన్న స్క్రిప్ట్ పెర్ ఫెక్ట్ గా వుండాలని నిత్య సూచించిందట. 

అయితే అక్కడితో ఆగకుండా ఎందుకయినా మంచిది అని, తనకు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా సందర్భంగా పరిచయం అయిన బుర్రా సాయి మాధవ్ ను మాటల రచయితగా తీసుకోమని సూచించిందట. ఆ మేరకు దర్శకుడు ఓకె అన్నాడట. సో, ఈ ఫ్రాజెక్టుకు నిత్య, బుర్ర సాయి మాధవ్ ఫిక్సయినట్లే.

Show comments