సీన్లోకి సాయి మాధవ్?

జాలీ ఎల్లెల్బీ సినిమా రీమేక్ లో పవన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ను టేకప్ చేసేందుకు డైరక్టర్ త్రివిక్రమ్ ముందుకు వచ్చారన్న సంగతి కూడా తెలిసిందే. అయితే తివిక్రమ్ ఇటు పవన్ సినిమాతో ఆ పై ఎన్టీఆర్ సినిమా పనులతో బిజీగా వున్నారు. ఆ తరువాత కుదిరితే మహేష్ సినిమా చేయాలి. ఇన్ని సినిమాల మధ్య ఆయను మొహమాట పెట్టి, ఇబ్బంది పెట్టడం కన్నా, వేరే ఆప్షనల్ కూడా చూడాలని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది.

ఫైనల్ సూపర్ విజన్ కు త్రివిక్రమ్ వుండనే వుంటారు. అందుకే పవన్ తనకు నచ్చిన మరో రచయిత బుర్రా సాయి మాధవ్ ను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. గోపాల గోపాల కు బుర్రా పని చేసారు. అప్పటి నుంచి పవన్ తో అనుబంధం పెరిగింది. ఖైదీ 150 కోసం కూడా పవన్ తనే స్వయంగా బుర్రాను రికమెండ్ చేసారు. 

సో, జాలీ ఎల్లెల్బీ కి బుర్రాను కూడా వినియోగించి, స్క్రిప్ట్ రెడీ చేయించాలని పవన్ సూచించినట్లు వార్తలు అందుతున్నాయి.

Show comments