లగడపాటి తిప్పలు

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ గతంలో తన స్వంత ఖర్చుతో సర్వేలు నిర్వహించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ను మచ్చిక చేసుకునేవారు. చాలా మటుకు ఆ సర్వేలు ఖచ్చితంగా తేలేవి. ఇప్పుడు రాజగోపాల్‌ బీజేపీ శిబిరంలో చేరారు.

సర్వేలు నిర్వహించి బీజేపీ నేతలు అందిస్తున్నారు. కాని లగడపాటి సర్వేల్లో మునుపటి వాడి, వేడి, పస తగ్గిపోయాయి. బీహార్‌లో ఆయన నిర్వహించిన సర్వే విఫలమైంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఆయన సర్వేలు నిర్వహించి బీజేపీదే పైచేయి అని బీజేపీ నేతలకు చెప్పుకుంటున్నారు. కాని ఆయన సర్వేను బీజేపీ నేతలే నమ్మడం లేదు.

ఒకవేళ లగడపాటి సర్వే నిజమయితే యూపీ ఎన్నికల తర్వాత అమిత్‌ షా ఆయనను అక్కున చేర్చుకుని ఏదో పదవి ఇచ్చే అవకాశాలున్నాయి.

 

Show comments