కనీసం వినాయక్ అయినా ఆదుకుంటాడా..?

కెరీర్ పరంగా చాలా కష్టాల్లో ఉన్నాడు సాయిధరమ్ తేజ్. ఎలాంటి సినిమా అయినా తేజూ చేయి పడితే ఫ్లాప్ అయిపోతోంది. తిక్క సినిమానే కెరీర్ లో పెద్ద డిజాస్టర్ అనుకుంటే అంతకుమించి అనే రేంజ్ లో విన్నర్ వచ్చేసింది.

ఈ రెండు సినిమాల దెబ్బతో ప్రస్తుతం చేస్తున్న జవాన్ సినిమాపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేకుండా పోయాయి. ఇలాంటి టైమ్ లో సాయిధరమ్ కెరీర్ లోకి వినాయక్ ఎంటర్ అయ్యాడు. 

వినాయక్-సాయిధరమ్ తేజ కాంబోలో సినిమా పక్కా అయింది. దుర్గ అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా తేజూను గట్టెక్కిస్తుందని చాలామంది భావిస్తున్నారు. ఖైదీ నంబర్ 150 లాంటి హిట్ తర్వాత వినాయక్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ప్రాజెక్టుపై జనాలకు కాస్త ఇంట్రెస్ట్ పెరిగింది.

రేయ్ సినిమాను మినహాయిస్తే కెరీర్ లో ఇప్పటివరకు యంగ్ డైరక్టర్స్ తోనే సినిమాలు చేశాడు సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం సినిమా చేస్తున్నప్పటికీ అందులో ఇతడు హీరో కాదు. సో.. వినాయక్ లాంటి సీనియర్ దర్శకుడితో సినిమా చేయడం తేజూకు కలిసొస్తుందని కొంతమంది భావిస్తున్నారు. 

మరోవైపు వినాయక్ ను కూడా గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. అతడు సీనియర్ దర్శకుడే అయినప్పటికీ బద్రినాథ్ లాంటి ఫ్లాపు, అఖిల్ లాంటి డిజాస్టర్ ఇచ్చింది కూడా ఇతడే.

సో.. సాయిధరమ్ తేజ్ ను వీవీ వినాయక్ ఆదుకుంటాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. దుర్గ సినిమాకు ఆకుల శివ కథ అందిస్తున్నాడు. సి.కల్యాణ్ నిర్మాతగా త్వరలోనే సెట్స్ పైకి రానుంది ఈ మూవీ.

Show comments