ఉరిమి ఉరిమి మెగా హీరో మీద?

పూరి- బాలయ్యల పైసా వసూల్ దసరా పండగ కన్నా ముందే వస్తుందని ఎప్పుడో వెల్లడించేసాం. అది కూడా ఎన్టీఆర్ డేట్ మీదకే వచ్చే ఆలోచనలు చేస్తున్నారని తెలిసిపోయింది. ఆ తరువాత ఇంకా అలా కాకుండా మరింత ముందుకు అంటే సెప్టెంబర్ 7న వచ్చేద్దాం అనుకుంటున్నారని ఆ మధ్యె వెల్లడించాం. అయితే ఇప్పుడు ఇంకా కొత్తా ఆలోచనలు ప్రారంభించారట పైసా వసూల్ నిర్మాత-దర్శకులు.

పని ఫినిష్ అయిపోతే సెప్టెంబర్ 1నే విడుదల చేసేయాలన్నది ఆ ఆలోచన. అయితే బాలయ్య డబ్బింగ్ అయిపోవచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ చకచకా సాగుతోంది. కానీ కాస్త గ్రాఫిక్స్ వర్క్ మాత్రం వుందని తెలుస్తోంది. ఆ వర్క్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది అన్న దానిపై క్లారిటీ రావడానికి ఒకటి రెండు రోజులు పడుతుందని తెలుస్తోంది.

ఒకవేళ వర్క్ ఫినిష్ ఇన్ టైమ్ లో అయిపోతుంది అనుకుంటే, బాలయ్య కు ఓ మాట చెప్పి సెప్టెంబర్ 1నే విడుదలకు రెడీ అయిపోతారట. అలా కాదు, వర్క్ టైట్ అవుతుంది అనుకుంటే, సెప్టెంబర్ 7కు వస్తారట. ఏమయితేనేం దసరాకు మాత్రం కాంపిటీషన్ సమస్య తీరిపోయింది. వారం గ్యాప్ లో ఎన్టీఆర్, మహేష్ వచ్చి దసరాకు సరదా చేసుకుంటారు.

Show comments