మెగా బ్రదర్స్ పై ఘాటు కామెంట్లు?

రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా, తమతో సంబంధాలున్నవారితో ఢిల్లీలోనో, బెజవాడలోనో డిన్నర్ పార్టీల్లో కూర్చున్నపుడు వినవచ్చే మాటలు వింటే మతిపోతుంది. వీళ్లేనా తెల్లవారి అలా, డిన్నర్ పార్టీల్లో ఇలా అని డవుట్ వచ్చేస్తుంది. మీడియా ముందు తిట్టుకునేవారు ఆ పార్టీల్లో కౌగిలించుకుంటారు. 

ఒకే కంచం, మంచంగా వుండేవారు, ఈ పార్టీల్లో ఒకరి వెనుక మరొకరు సైటైర్లు విసురుకుంటారు. జస్ట్ కొద్ది రోజుల క్రితం ఓ నిర్మాత ఢిల్లీలో ఇలాంటి పార్టీలో ఓ పొలిటికల్ పెద్దాయినను కలిసాడట. సీమకు చెందిన ఆ పెద్దాయనది, కొంచెం పుల్ల విరిచినట్లు మాట్లాడే నైజం. బాబు అయినా, ఆయన బాబు అయినా సరే ఆయన స్టయిల్ ఆయనదే. 

సరే ఈ నిర్మాత దగ్గర మెగా బ్రదర్స్ ప్రస్తావన వచ్చిందట. దాంతో సదరు సీమ పెద్దాయిన, మెగా బ్రదర్స్ పై ఘాటు కామెంట్లు చేసారట. పేద్ద లిస్టు చదివి, ఆ బ్రదర్స్ వాళ్లకైమైనా చేసారా? వాళ్లంతా వాళ్లని నమ్ముకుని మునిగిన వాళ్లేగా.

అంటూ సదరు నిర్మాతను కూడా చీవాట్లు పెట్టాడట. అలా చీవాట్లు పెట్టడానికి కారణం ఏమిటంటే, మెగాబ్రదర్స్ ను సదరు నిర్మాత నెత్తిన మోసి, మిగిలిన హీరోలకు దూరంకావడమే నట. ఆ వైనం గుర్తు చేసి, 'ఏం బావుకున్నావ్' అని నిలదీసాడట. ఆళ్లను నమ్ముకుంటే...అంతేగా మరి..అని చెప్పి చక్కాపోయాడట ఆ పెద్దాయిన.

Show comments