ట్వీట్లతో జనాలు రారేమో?

సినిమా ఎంత అప్ డేట్ అవుతున్నా, ప్రఛారానికి మాత్రం పోస్టర్ తప్పదు. అలాగే ఇప్పుడు టీవీ ప్రచారం తప్పదు. ఇంటింటికీ సినిమాను చేరవేసేది టీవీ మాధ్యమమే అన్నదాంట్లో సందేహం లేదు. ఒక్క ఓవర్ సీస్ జనాలను మాత్రమే ట్విట్టర్, ఫేస్ బుక్ ల్లాంటి ప్రచారాలు ప్రభావితం చేసే అవకాశం వుంది. ఇప్పుడే ఇదే సందేహం వచ్చింది హీరో నానికి అని సమాచారం. 

తన మజ్ఞు సినిమాకు ప్రచారం తక్కువగా వుండడంపై, ఆ మేరకు వార్తలు రావడంతో హీరో నాని కాస్త ఆందోళన చెందారట. ఆ మేరకు తన డిజిటిల్ మీడియా వ్యవహారాలు చూసే వాళ్లతో డిస్కషన్లు చేసినట్లు తెలుస్తోంది. అయినా కేవలం ట్వీట్లతో సినిమాకు ప్రచారం, ఓపెనింగ్స్ సాధ్యమా అని నానే ఈ సందర్భంగా కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా బాగా వచ్చిందని, కానీ జనాల దగ్గరకు తీసుకెళ్లడం మాత్రం సరిగ్గాలేదని నాని అన్నట్లు తెలుస్తోంది. 

లవ్ కె రన్ లాంటి అసలు ఎక్కడ ఆడుతున్నాయో తెలియని సినిమాలు కూడా టీవీలో పబ్లిసిటీ కుమ్మేస్తుంటే, నాని మజ్ఞు సినిమా అసలు ఈవారమే వస్తోందా అని జనాలకు అనుమానం కలుగుతోంది. సినిమా విడుదల ఇంకా రెండు రోజులే వుంది. ఇంతవరకు నాని మీడియాతో కూడా ఇంటరాక్ట్ కాకపోవడం విశేషం.

Show comments