మెగా ఫంక్షన్ కు నాగ్, వెంకీ

డిసెంబర్ సెకెండ్ వీక్ లో ప్లాన్ చేస్తున్న మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నెంబర్ 150కి ఏర్పాట్లు షురూ అయ్యాయి. డేట్ ఫిక్స్ కాలేదు కానీ, అతిధులతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా మాట్లాడి, అన్నీ ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ధృవ సినిమా విడుదల తరువాతే ఈ ఫంక్షన్ వుంటుంది. అలా అయితే, ధృవ సక్సెస్ తోడై అభిమానుల్లో జోష్ వుంటుందని భావిస్తున్నారు. 

కేవలం మెగా క్యాంప్ నకు చెందిన హీరోలు మాత్రమే హాజరయితే ఇదేదో స్వంత ఇంటి ఫంక్షన్ మాదిరిగా వుంటుందని, అందుకనే, దీనికి టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ హాజరయ్యేలా చూడాలని చిరు డిసైడ్ అయ్యారు.  ఈ క్రమంలో హీరోలు నాగార్జున, వెంకీ, మోహన్ బాబులను ఇప్పటికే ఆహ్వానించారు. వారు ఓకె అన్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మెగా హీరోల సంగతి సరేసరి. 

ఈ జనరేషన్ యంగ్ హీరోలందరికీ మెగా యంగ్ హీరోలతో మాంచి రాపో వుంది. సో, వారంతా తాము కూడా హాజరవుతామని ఇప్పటికే చెప్పేసినట్లు వినికిడి. అంటే ఈ లెక్కడ ఖైదీ నెంబర్ 150 అడియో ఫంక్షన్ ఓ భారీ టాలీవుడ్ ఫంక్షన్ గా మారబోతోందన్నమాట. 

Show comments