ఇక్కడ 70 అక్కడ కోటీ 60

టైమ్ వస్తే, దశ తిరుగుతుంది. ఇంక ఎవ్వరూ ఆపలేరు. ముకుంద, ఒక లైలా కోసం అంటూ రెండు సినిమాలు చేసినా, ఆ పై బాలీవుడ్ కు వెళ్లి వచ్చినా పూజా హెగ్డే లక్ మారలేదు.

డిజె సినిమాలో అమ్మడు తనలోని కమర్షియల్ అందాలు బయట పెట్టేసరికి ఆఫర్లు తరుముకుంటూ వస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ సినిమా కోసం కోటికి పైగా ఆఫర్ చేస్తూ పూజాతో బేరాలు సాగించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అది ఫైనల్ అయింది. ఏకంగా కోటి అరవై లక్షలకు సెటిల్ అయిందట. వాస్తవానికి పూజా హెగ్డే కు డిజె సినిమాకు గాను ముట్టింది జస్ట్ 70 లక్షలు మాత్రమే. అలాంటిది ఒకసారి డబుల్ కన్నా ఎక్కువకు పెరిగిపోయింది.

ప్రస్తుతం టాలీవుడ్ లోని యంగ్ హీరోయిన్లు కోటికి పైగా తీసుకుంటున్నవారు ఒకరిద్దరు మాత్రమే వున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కోటికి పైగా తీసుకుంటోంది. ఇప్పుడు పూజా కూడా ఆ జాబితాలో చేరింది. మిగిలిన వారంతా నలభై లక్షల నుంచి అరవై లక్షల రేంజ్ లోనే వున్నారు ఇంకా.

Show comments