బండ్ల ఎస్కేప్..దిల్ రాజు బుక్డ్

ఒక్కోసారి అంతే ఎవరికో తగలాల్సింది మరెవరికో తగులుతుంటుంది. కొన్నాళ్ల క్రితం నిర్మాత బండ్ల గణేష్ యంగ్ హీరో అఖిల్ తో సినిమా తీయాలనుకున్నాడు. ఇందుకోసం డైరక్టర్ మణిరత్నం తో డిస్కషన్లకు వెళ్లాడు కూడా. అలాంటి టైమ్ లో దర్శకుడు మణిరత్నం ఓ సినిమాను కార్తీ-అమృతరావ్ కాంబినేషన్ లో  చేస్తున్న సంగతి తెలిసింది.మంచి కాంబినేషన్ కదా అని కోటిన్నర అడ్వాన్స్ ఇచ్చేసాడు. తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం అడ్సాన్స్ ఇచ్చిన తరువాత చిన్న విశేషం జరిగింది. బండ్ల తక్కువోడు కాదు కదా, తన తెలివితేటలు వాడి, ఆ సినిమా కథేమిటి? కమామిషేమిటి? అన్నవి కనుక్కున్నాడు.  లేదా మరేదో జరిగిందో తెరవెనుక. తనకు ప్రాజెక్టు వద్దని, డబ్బులు వెనక్కు ఇచ్చేయమని చెప్పేసాడు.

కట్ చేస్తే, అంతకు ముందే మణిరత్నంతో ఓకె బంగారం చేసి, హిట్ కొట్టిన ఆనందంతో నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టును టేకప్ చేసారు. సుమారు ఏడున్నర కోట్ల రూపాయిలకు చేలియా తెలుగు వెర్షన్ తీసుకున్నారు. ఎందుకంటే తెలుగువాళ్లకు పరిచయం అయిన కార్తీ వున్నారు కదా అన్న ధీమా.  ఆ పైన ఖర్చులు మామూలే. మరి ఇప్పుడు ఏ మేరకు కిట్టుబాటు అవుతుందా అన్నది తెలియాల్సి వుంది. ఇండస్ట్రీ వర్గాలు అయితే కాస్త కష్టమే అంటున్నాయి.

Show comments