డైరక్టర్ అశోక్ కు జాక్ పాట్

పిల్ల జమీందార్ తో మాంచి హిట్ కొట్టి, ప్రస్తుతం భాగమతి నిర్మాణం పనుల్లో బిజీగా వున్నారు డైరక్టర్ అశోక్. ఆయనకు ఈ నెల 17న జాక్ పాట్ తగిలింది. అంటే లాటరీ కాదు, ఆయన భార్య ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారట. తల్లీ పిల్లలు క్షేమంగా వున్నారు. ఇద్దరు  ఆడ బిడ్డలు, ఒక మగశిశువుకు అశోక్ భార్య జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. 

విషయం తెలిసినవారంతా అశోక్ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.అశోక్ అందించబోయే భాగమతి సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోంది.

Show comments